గౌతమి

గౌతమి

Saturday, November 2, 2019

ఆయన మనల్నాడించడంలేదు...మనమే ఆడుతున్నాం.

జీవులు శరీరమనే ఉపాధి ని భగవంతుని కృపతో పొంది, ఆ ఉపాధి ద్వారా కాలానికి అనుగుణంగా దానికి బద్ధులై ప్రారబ్దాలను పూర్తిచేసుకొని వెళ్ళిపోతారు. దీంట్లో కాలానికి వున్న ప్రాముఖ్య్తత అత్యంతం. ఎందుకంటే కాలాయాపన జరిగినా, కాలం దాటిపోయినా ఆ ప్రారబ్దాన్ని పూర్తిచేసుకోవడానికి అంతరాయం కలిగినట్లే. మళ్ళీ ఆ కాలం కలిసిరావడానికి ఎన్ని జన్మలు పట్టచ్చో...చెప్పలేం. మళ్ళీ ఆ కాలం వచ్చునో లేదో??? అది మళ్ళీ ఫిక్సుడు డిపాజిట్ లో పడుతుంది. అట్టి కాలాన్ని సాధన ద్వారా గుర్తించి ఈ శరీరమనే ఉపాధి సహాయంతో ప్రారబ్దాలను పూర్తిచేసుకోమనే శరీరాన్ని శివుడు మనకు ప్రసాదించాడు. ఈ సౌలభ్యం ఇతర జీవరాశులకు లేదు.
.
84 లక్షల కోట్ల జీవరాశులు ఈ భూమిమీద ఉన్నాయి. మట్టిలోపలే పుట్టి, మట్టినే తింటూ, మట్టిలోనే పెరిగి, మట్టిలోనే చచ్చిపోయే జీవికి కనీసం వెలుగుని చూసే అవకాశంవుండదు. మట్టిలోనే వుండే దానికి కళ్ళు అవసరం లేదు, కాబట్టి దానికి కళ్ళులేవు ఇహ దానికి వెలుగెందుకు? మట్టిలో వుండే ఈ జీవికి మెదడు ఇవ్వబడలేదు, అది దైవం గురించి ఆలోచించదు. మట్టిలోపల చీకట్లో వుండే ఆ జీవికి ఊర్ధ్వముఖంగా చూసే భాగ్యముండదు ఎందుకంటే కళ్ళులేవు. కాబట్టి ఈ జీవికి ప్రారబ్దాలను మొయ్యడమే తప్పా...వాటిని తొలగించుకొనే అవకాశం మట్టిలోవుంటుండగా లేనేలేదు. అది పొందాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు మానవజన్మకు ఎదురుచూడాల్సిందే.
.
క్షీరదాలలో ఎలుకలువున్నాయి, మనిషివున్నాడు అంత మాత్రం చేత మనిషి, ఎలుక ఒకటి కాదు. ఎలుక అడ్డంగా పెరిగే జంతువు, మనిషి ఊర్ధ్వముఖంగా పెరుగుతాడు, తనకన్నా ఎంతో ఎత్తును చూస్తాడు, సాధన ద్వారా భగవంతుని చూడగలిగే, చేరుకోగలిగే భాగ్యము కేవలం మానవునికి మాత్రమే వుంది. ఎలుకకు లేదు. అలాగని ఏనుగు ఎత్తుగా పెరుగుతుందికదా, ఏనుగుకుందా అని ప్రశ్నవెయ్యొచ్చు. ఏనుగు సేవలను అందించే భాగ్యాన్ని పొందింది. ఎలుకకు ఆ భాగ్యమూ లేదు. ఇలా జంతువులకు లేని భాగ్యాలెన్నో మానవుడికిచ్హాడు ఆ పరమాత్ముడు, తనను గుర్తించమని. అయినాసరే మానవుడు ఆ పని చెయ్యకుండా కుడితిలో పడ్డ ఎలుకలా ఇహలోక సౌలభ్యాలలో కొట్టుమిట్టాడుతూ కాలాయాపన చేస్తే ఆ మానవుడికే నష్ఠం. కనీసం ఇతరులెవరైనా సత్యాన్ని గ్రహించి తమదారిలో తాము సాధన చేసుకుంటున్నప్పుడు నీచ ఎలుకల్లా, పనికిరాని బొద్ధింకలా, పట్టిపీడించే చెదపురుగుల్లా పాడుచెయ్యకూడదు. దీనివల్ల వారికి కాలాయాపన జరిగి నష్ఠపోతారు గనుక, ఆ నష్ఠానికి వీరు బాధ్యులయి మరుజన్మల్లో మానవరూపమున్నా నికృష్ఠులుగా, లోకకంఠకులుగా చెదపురుగు మరియు నీచంగా కలుగుల్లో పెరిగే ఎలుకల లక్షణాలతో పుట్టగలరు. ఇట్టివారు ఊర్ధ్వముఖంగా పెరిగినా, భగవంతుని చూడలేరు, క్రింద మట్టిపురుగువలెవుందురు. తమమలమూత్రాలతోనే ఒకదాన్నిమరొకటి గుర్తు పట్టుకొని బ్రతికే ఎలుక గుంపుల్లా జీవించెదరు, పుష్ఠికరమయిన చెట్లను తినేస్తూ బ్రతికే చెదలా జీవించెదరు. ఈ జీవరాశుల్లాగే మానవళికేమాత్రం ఉపయోగంలేని నిర్భాగ్యపు జీవితాలు జీవించెదరు. ఇలా ఎన్నో..ఎవరిలోనయినా ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే శిక్ష అనుభవిస్తున్నారని అర్ధం.
                                                 
ఇదే కాలానికున్న మహిమ. నాడు నువ్వు ఒకరికి చేసేదానికి వెంటనే శిక్షపడకపోవచ్చు, కాలం ఎప్పుడోకమారు ఏదోకరూపంలో ప్రతీకారం తీర్చుకుంటుంది. కనీసం అప్పుడు నువ్వు తెలుసుకున్నాకూడా -సన్నని సాలెపురుగు ప్రోగులాంటి సహాయాన్ని నీకందించి క్రిందపడకుండా ఆ పారిజాతన్ని రక్షించినట్లు రక్షిస్తాడు ఆ దేవుడు. లేకపోతే ఇంతే సంగతి.
.
నరకం ఎక్కడో లేదు!
.
Gauthami Jalagadugula
.
Picture- Google courtesy. Not mine.

నా మరో రచన, వార్త వారి సౌజన్యంతో- "మనసులో చోటు"....